Tue May 21 2024 03:19:55 GMT+0000 (Coordinated Universal Time)
రక్షణ కల్పించండి.... సీబీఐ చీఫ్ కు లేఖ
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సీబీఐ చీఫ్ కు లేఖ రాశారు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సీబీఐ చీఫ్ కు లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులందరినీ అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలోనూ పరిటాల రవి హత్య కేసులో నిందితులను అంతమొందించిన విషయాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు.
ప్రాణభయం.....
అలాగే జైల్లో కాని, బయట కాని ఉన్న నిందితులకు రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణరాజు సీబీఐ చీఫ్ ను కోరారు. సాక్షులకు కూడా ప్రాణ భయం ఉందన్నారు. అందుకే వీలయినంత త్వరగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన సీబీఐ చీఫ్ కు రాసిన లేఖలో కోరారు.
Next Story