Fri Dec 05 2025 14:17:23 GMT+0000 (Coordinated Universal Time)
Ysrcp : 26 నుంచి బస్సు యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర ద్వారా నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించిన నేపథ్యంలో ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్రను ప్రారంభించనున్నారు.
ప్రజలకు వివరించేందుకు ....
బస్సుయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటారు. ప్రభుత్వం గత 52 నెలలుగా అమలు చేసిన సంక్షేమ పథకాలను గురించి వివరించనున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలతో నియోజకవర్గాలన్నీ కవర్ చేయాలని నిర్ణయించారు. మ్యానిఫేస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన విషయాన్ని కూడా ప్రజలకు వారు చెప్పనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.
Next Story

