Thu May 02 2024 11:09:26 GMT+0000 (Coordinated Universal Time)
వైెఎస్సార్ వారసుడు జగన్ కాదు
జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని వైఎస్ షర్మిల అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గంలో మాట్లాడారు
జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని వైఎస్ షర్మిల అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదన్నారు. బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడటం లేదన్నారు. జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన అని అన్నారు. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన అని దుయ్యబట్టారు. సీబీఐ అవినాశ్ రెడ్డిని నిందితుడు అని చెప్పిందని, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిందన్నారు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు అన్ని ఉన్నాయని అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు.
రైతులు కూడా ...
జగన్ పాలనలో రైతు తీవ్రంగా నష్టపోయాడన్న వైఎస్ షర్మిల రైతులను మోసం చేశాడన్నారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడన్నారు. వైఎస్సార్ హయాంలో రైతు రారాజుగా ఉండేవాడని, జగన్ హయాంలో అప్పు లేని రైతు లేడని అన్నారు. పంట నష్టం జరిగితే రూపాయి పరిహారం లేదని, మొత్తం సబ్సిడీలను బంద్ పెట్టారన్నారు. కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం నిండా ముంచిందని అన్నారు. జగన్ ఎన్నికల్లో 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చారన్నారు. అధికారంలో వచ్చాకా పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అని యువతను మోసం చేశాడని షర్మిల దుయ్యబట్టారు.
Next Story