Sun Feb 01 2026 18:16:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan :నేటి నుంచి మూడు రోజులు కడపలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 25, 26,27 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలతో పాటు, కార్యకర్తలతోనూ వైఎస్ జగన్ సమావేశమవుతారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. రేపు మధ్యాహ్నానికి బెంగళూరు నుంచి కడపకు చేరుకుంటారు.
పార్టీ కార్యకర్తలతో సమావేశం...
అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. తర్వాత స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి వినతులను స్వీకరిస్తారు. 26వ తేదీన పూర్తిగా వివాహ వేడుకకు హాజరవుతారు. దీంతో పాటు పలువుని నేతలను కలవనున్నారు. అనంతరం 27వతేదీన ఆయన తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. వైఎస్ జగన్ కడపకు వస్తున్న సందర్భంగా కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు.
Next Story

