Sun Feb 01 2026 22:44:36 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ ఘాట్ వద్ద నివాళులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జంయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జంయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. జగన్ కుటుంబ సభ్యులతో కలసి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వైఎస్ జగన్ తాడేపల్లి బయలుదేరారు.
రాష్ట్ర వ్యాప్తంగా...
నిన్న ఇడుపులపాయకు చేరుకున్న జగన్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయాన్నే వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్ కాసేపు కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనలు చేశారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Next Story

