Wed Dec 17 2025 06:44:33 GMT+0000 (Coordinated Universal Time)
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో యోగాంధ్ర
విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఒకేసారి.. ఒకే చోట 3.20 లక్షల మంది యోగాసనాలు చేయడంతో ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సర్టిఫికేట్ ను మంత్రి నారా లోకేశ్, సత్యకుమార్ లకు విశాఖలో అప్పగించారు. గతంలో ఉన్న రికార్డులను విశాఖ యోగాంద్ర బద్దలు కొట్టిందని తెలిపారు.
ధృవపత్రాలను అందచేసి...
ఈ మేరకు ధృవపత్రాలను గిన్నిస్ బుక్ ఆఫ్ సంస్థ ప్రతినిధులు అందచేశారు. ఒకేసారి ఇరవై వేల మందితో గిరిజన విద్యార్థులు కూడా సూర్యనమస్కారాలు చేయడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. ఈ రెండింటికి సంబంధించిన ధృవపత్రాలను గిన్నిస్ సంస్థ ప్రతినిధుల నుంచి మంత్రులు అందుకున్నారు.
Next Story

