Wed May 15 2024 18:08:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత.. నరసన్నపేటలో ఉద్రిక్తత
పార్కు కూల్చివేతపై సమాచారం అందుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి కార్యకర్తలు పార్క్ వద్దకు చేరుకున్న
నరసన్నపేట : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కు కూల్చివేత ఉద్రిక్తతలకు దారుతీసింది. గత ప్రభుత్వ హయాంలో పార్క్ నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు కావడంతో.. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిన్న వేకువ జామున కొందరు వ్యక్తులు రెండు జేసీబీలతో అక్కడకు చేరుకుని నిర్మాణంలో ఉన్న పార్కును కూల్చివేశారు. పార్కు ప్రహరీ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతోపాటు అంతర్గతంగా వేసిన రోడ్లను కూడా ధ్వంసం చేశారు.
పార్కు కూల్చివేతపై సమాచారం అందుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి కార్యకర్తలు పార్క్ వద్దకు చేరుకున్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై దాడిచేయడంతో పరుగులు తీశారు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతను అడ్డుకుని, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. చిన్నపిల్లల కోసం నిర్మిస్తున్న పార్కును కూల్చివేసి, ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారందరినీ అరెస్ట్ చేయాలని రమణమూర్తి డిమాండ్ చేశారు.
Next Story