Thu Dec 18 2025 17:52:14 GMT+0000 (Coordinated Universal Time)
వన్ సైడ్ విక్టరీ.. అందుకేనట
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించింది. 12 మున్సిపాలిటీల్లో వైసీపీ తొమ్మిది స్థానాల్లో గెలిచింది

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విక్టరీని సాధించింది. పన్నెండు మున్సిపాలిటీల్లో ఇప్పటికే వైసీపీ తొమ్మిది స్థానాల్లో గెలిచింది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇక కొండపల్లి, జగ్గయ్యపేటలో హోరాహోరీ పోరు సాగుతుంది. నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ పరమయింది.
వైసీపీ గెలిచింది....
కుప్పం, బేతంచర్ల, పెనుకొండ, దాచేపల్లి, గురజాల, బుచ్చిరెడ్డి పాలెం, ఆకివీడు, కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక విశాఖలో జరిగిన వార్డులు కూడా వైసీపీ పరమయ్యాయి.
Next Story

