Tue Jan 20 2026 23:15:15 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ప్రశాంత్ కిషోర్ పై బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీకే ఒక క్యాష్ పార్టీ అని అన్నారు. ఆయను వన్ టైం సెటిల్మెంట్ అని అనుకున్నామని అన్నారు. ప్రశాంత్ కిషోర్ లేకున్నా ప్రస్తుతం ఐ ప్యాక్ టీం నిర్మాణాత్మకంగానే ఉందని తాము భావిస్తున్నమని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వన్నీ గిమ్మిక్కులేనని ఆయన కొట్టిపారేశారు. 2019 లో తాము భ్రమల్లో ఉండి ఆయనను తీసుకువచ్చామని బొత్స అన్నారు. జగన్ కు జిమ్మిక్కులు అవసరమని, శాశ్వతంగా పార్టీ నిలదొక్కుకోవాలని కోరుకుంటారని అన్నారు.
ఐ ప్యాక్ చెప్పిన వారందరికీ...
కన్సెల్టెన్సీ కింద ఐప్యాక్ టీంను తాము తీసుకున్నామని తెలిపారు. అయితే దాని సలహాలు మాత్రమే తీసుకుంటామని, పార్టీ నిర్ణయం మేరకే చివరకు డెసిషన్ఉంటుందని తెలిపారు. కో- ఆర్డినేషన్ కోసమే ఐప్యాక్ సంస్థను కన్సెల్టన్సీగా తీసుకున్నామని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ చెప్పడానికి ఆయనేమైనా బ్రహ్మా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ అయినా.. ఐ ప్యాక్ టీం అయినా తాత్కాలికమేనని, వైసీపీ శాశ్వతమని అన్నారు. ఐ ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్ ఇచ్చామన్నది అవాస్తవమని తెలిపారు.
Next Story

