Sun May 19 2024 00:53:41 GMT+0000 (Coordinated Universal Time)
జనం అసహ్యించుకుంటున్నారు... బాబూ?
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అన్నీ అబద్ధాలు చెబుతూ పచ్చ పార్టీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. మొన్నటి మొన్న అమిత్ షా గారు ఫోన్ చేశారంటూ బొంకారన్నారు. ఈరోజు చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ చేసి తెగ బాధ పడిపోయారని, కొన్ని కన్నీటి బొట్లు కూడా రాల్చారని ఒక వర్గం మీడియాలో ప్రచారం చేయించారు.
అంతా తూచ్....
కానీ ఆ తర్వాత అదంతా తూచ్ అని తేలిపోయిందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ను చూసి జనం అసహ్యించుకుంటున్నారు బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story