Mon Jan 20 2025 05:56:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ నేత తోట త్రిమూర్తులకు బెయిల్
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ లభించింది
శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ లభించింది. ఆయనకు ఈ కేసులో విశాఖ న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. తోట త్రిమూర్తులతో పాటు మరో ఆరుగురికి ఈ కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానాను కూడా విధించింది. తోట త్రిమూర్తులతో పాటు ఆయనతో పాటు ఉన్న నిందితులు వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్నికల్లో పోటీకి...
దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని తోట త్రిమూర్తులు తెలిపారు. చివరకు న్యాయమే జరిగిందని, తనకు ఏదో జరగాలని ఊహించిన తన ప్రత్యర్థులకు ఇది ఆశాభంగం అయినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. తోట త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో విశాఖ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించంది.
Next Story