Sat Dec 06 2025 00:42:32 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై ఆర్కే రోజా హార్ష్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హార్ష్ కామెంట్స్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా హార్ష్ కామెంట్స్ చేశారు. కుప్పంలో ప్రజలు చంద్రబాబును తరిమికొట్టారన్నారు. తండ్రి కొడుకులు ఇక్కడికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టినా ప్రజలు ఆదరించలేదని రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఇక తాళాలు వేసుకోవాలని రోజా ఎద్దేవా చేశారు.
ఇల్లు కూడా లేని....
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తున్నాయని రోజా అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని, అందుకే ఆయనను కుప్పం ప్రజలు హైదరాబాద్ కు పరిమితం చేశారన్నారు రోజా.
Next Story

