Mon May 20 2024 13:58:37 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : జగన్ నాకు టిక్కెట్ ఇవ్వలేనని చెప్పేశారు
పార్టీ అధినేత వైఎస్ జగన్ చింతలపూడి టిక్కెట్ తనకు ఇవ్వలేనని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు
పార్టీ అధినేత వైఎస్ జగన్ చింతలపూడి టిక్కెట్ తనకు ఇవ్వలేనని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు. ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు చింతలపూడి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని తనకు జగన్ స్పష్టం చేసినట్లు ఎలీజా తెలిపారు.
అమలాపురం ఎంపీగా...
అయితే అందుకు బదులుగా తనను అమలాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని జగన్ కోరినట్లు ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు. అయితే తాను అంతటి సాహసాన్ని చేయలేనని ముఖ్యమంత్రి జగన్ కు తెలిపానని ఎలీజా తెలిపారు. చింతలపూడిలోని ఒక వర్గం నాయకులే తనను వ్యతిరేకిస్తున్నారన్న ఎలీజా, వారే తనను మార్చాలని జగన్ పై వత్తిడి తెచ్చారంటూ ఆరోపించారు.
Next Story