Fri Dec 05 2025 21:45:17 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు పల్నాడు జిల్లాకు జగన్
వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాకు వెళ్లనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు

వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బయలేదేరి ఆయన పది గంటలకు రెంటపాళ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ వైసీపీ కార్యకర్త, గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
కుటుంబాన్ని పరామర్శించి...
నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ గా ఉండి వేధింపులకు పాల్పడలేక ఆత్మహత్యకు పాల్పడటంతో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారు. అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. అయితే పోలీసులు కేవలం వంద మందికి మాత్రమే జగన్ త పాటు పర్యటనకు అనుమతించారు. కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

