Tue Mar 17 2026 17:33:57 GMT+0530 (India Standard Time)
నేడు కుప్పం క్యాడర్ తో జగన్
నేడు వైసీపీ అధినేత జగన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఒకరోజు ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.

నేడు వైసీపీ అధినేత జగన్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఒకరోజు ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఈరోజు కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ కార్యకర్తలతో సమావేశం అవుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రతిరోజూ...
పార్టీ గెలుపునకు కార్యకర్తలే ముఖ్య కారణం. దానిని గుర్తించిన జగన్ వారికున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గాల్లో సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రస్తుత పరిస్థతిని కూడా వారిని అడిగి తెలుసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి రోజూ సాయంత్రం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో జగన్ సమావేశం అవుతారు.
Next Story

