Fri Dec 05 2025 14:58:19 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : తాడేపల్లి టు రెంటపాళ్ల... ఆరుగంటల జర్నీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లకు చేరుకున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లకు చేరుకున్నారు. ఉదయం పది గంటలకు జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరగా రెంటపాళ్లకు చేరుకునే సాయంత్రం నాలుగున్నర గంటలయింది.అంటే దాదాపు దాదాపు ఆరున్నర గంటల పాటు జగన్ కాన్వాయ్ ప్రయాణం సాగింది. అడుగడుగునా కార్యకర్తలు, పార్టీ అభిమానులు అడ్డుకోవడంతో జగన్ కాన్వాయ్ ప్రతి చోటా అంగుళానికి మించి కదలలేకపోయింది. పల్నాడుజిల్లాలో జగన్ పర్యటనకు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున కార్యకర్తలు తరలి రావడంతో రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి.
నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ...
రెంటపాళ్ల చేరుకున్న జగన్ కు గజమాలతో వైసీపీ నేతలు స్వాగతం పలికారు. రెంటపాళ్లలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అడుగడుగునా ఆలస్యం కావడంతో జగన్ రాక ఆరు గంటల పాటు ఆలస్యమయింది. అయినా జగన్ రాక కోసం కార్యకర్తలు సాయంత్రం ఐదు గంటల వరకూ ఎదురు చూస్తూనే ఉన్నారు. జగన్ రాక సందర్బంగా పోలీసుల ఆంక్షలు కూడా పనిచేయలేదు. బారికేడ్లను తోసుకుని మరీ జగన్ ను చూసేందుకు తరలి రావడంతో రెంటపాళ్ల గ్రామం జనసంద్రమయింది.
Next Story

