Tue May 20 2025 02:35:15 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : రోహిణి కార్తెకు ముందు ఈ వెదర్ ఏంటి సామీ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చూస్తే గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చూస్తే గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ఇక మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందోనని అందరూ భయపడిపోయారు. మే నెలలో రోహిణి కార్తె కూడా ఉండటంతో యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందన్న అంచనాలు వినిపించాయి. ఎందుకంటే మార్చి నెలలోనే నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సహజంగా మే నెలలో యాభై డిగ్రీలు దాటతాయని అందరూ భావించారు.
త్వరగానే రుతుపవనాలు...
కానీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ మే రెండో వారానికి మే రెండో వారంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు తమ పంటలను కోల్పోతున్నారు. అయితే అదే సమయంలో ప్రజలు మాత్రం వేడిగాలుల తీవ్రత నుంచి, అత్యధికస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాసింత ఉపశమనం దొరికినట్లేనని ప్రజలు భావిస్తున్నారు. సాయంత్రానికి కొంత చల్లటి గాలులువీయడంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో విభిన్నకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కొంత రిలీఫ్...
పగలు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ సాయంత్రానికి చల్లబడుతుండటం తో చాలా వరకూ రిలీఫ్ దొరుకుతుంది. మరొక వైపు వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెలలోనే కేరళకు రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. అంటే జూన్ చివరి నాటికి ఎండలతీవ్రత తగ్గే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షం పడుతుందని తెలిపింది. అలాగే అమరావతి వాతావరణ కేంద్రం కూడా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఉష్ణోగ్రతలు తగ్గుతాయట...
దీంతో పాటు ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, ప్రస్తుతం నమోదయ్యే దాని కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. తెలంగాణలో పథ్నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఏపీలో కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల నలభై నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Next Story