Fri Mar 29 2024 05:23:42 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని ట్వీట్.. టీడీపీకి..?
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తెలుగుదేశం పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తెలుగుదేశం పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ట్వీట్ మళ్లీ టీడీపీలో కలకలం రేపుతుంది. యదార్థ వాది లోక విరోధి అనన సామెత గుర్తుకు వస్తుంది. నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజలు వైసీపీలోకి పంపించే బదులు చెప్పింది అర్ధం చేసుకుని పార్టీని పటిష్ట పర్చుకుని అధికారంలోకి ఎలా తీసుకు రావాలో ఆలోచిస్తే మంచిదని టీడీపీకి కేశినేని నాని సూచించారు.
టీడీపీ వర్గాలు...
ఇటీవల కేశినేని మీడియా మిత్రులతో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియా ఆయనపై సెటైర్లు వేయడంతోనే ఈ ట్వీట్ చేశారని తెలిసింది. పార్టీని గెలిపించే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేవని, వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలవదని కేశినేని నాని అన్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణులు నాని వ్యాఖ్యలపై మండి పడుతున్నాయి. ఇందుకు ప్రతిగా ఆయన మరోసారి ట్వీట్ చేశారు.
Next Story