Vasireddy Padma : వాసిరెడ్డి పద్మను ఎవరూ దరిదాపుల్లోకి రానివ్వడం లేదా?
వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అయితే ఆమె ఇప్పటి వరకూ ఏ పార్టీలోనూ చేరలేదు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు వెంటనే ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు నెలలో ఆమె రాజీనామా చేసినప్పటికీ ఇంత వరకూ టీడీపీలో వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరలేదు. డిసెంబరు నెలాఖరులోనే చేరాల్సిన వాసిరెడ్డి పద్మ టీడీపీ లో చేరలేకపోయారు. అయితే వాసిరెడ్డి పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం పెద్దయెత్తున చెప్పారని తెలిసింది. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.

