Sun Feb 01 2026 21:54:47 GMT+0000 (Coordinated Universal Time)
అనురాగ్ సింగ్ ఆలింగనం.. పాత జ్ఞాపకాలు
కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభకు ఆయన హాజరయ్యారు

కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నాగోతు రమేష్ నాయుడు గతంలో చేసిన పోరాటాన్ని ఆయన గర్తు చేసుకున్నారు. గతంలో రమేష్ నాయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
పోరాటం చేసి...
చంద్రబాబు ప్రభుత్వంపై బాబు ఏది. జాబు ఏది? అని పోరాటం చేశారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రులు మారినా ప్రభుత్వంలో పనితీరు మారలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రమేష్ నాయుడుతో తన సాన్నిహిత్యాన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్ గుర్తు చేసుకున్నారు. త్వరలో ఏపీలో ప్రభుత్వం మారుతుందని ఆయన జోస్యం చెప్పారు.
Next Story

