Fri Jan 30 2026 16:09:48 GMT+0000 (Coordinated Universal Time)
రికార్డు స్థాయి ఆదాయం
తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతుంది. ఇటీవల కొద్ది రోజులు తగ్గిన రద్దీ మళ్లీ మొదలయింది

తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతుంది. ఇటీవల కొద్ది రోజులు తగ్గిన రద్దీ మళ్లీ మొదలయింది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని 02 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంలో ఎస్ఎస్డీ టోకెన్లు లేని వారికి దర్శన సమయం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనానికి...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,221 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,409 మంది భక్తులు తలనీలలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.45 కోట్ల రూపాయలు వచ్చిందని, ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో రోజు వారీ ఆదాయం నమోదయిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

