Mon Dec 08 2025 16:15:59 GMT+0000 (Coordinated Universal Time)
37వ రోజుకు చేరిన పాదయాత్ర
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేటికి 37వ రోజుకు చేరుకుంది

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేటికి 37వ రోజుకు చేరుకుంది. నవంబరు 1వ తేదీన ఈ యాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమయింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరిటి జరుగుతున్న యాత్రకు పెద్దయెత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. వైసీపీని మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి.
నెల్లూరు జిల్లా నుంచి...
ప్రస్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి వల్లివేడు మీదుగా చిత్తూరుకు చేరుకోనుంది. ఈ నెల 15వ తేదీన తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది.
Next Story

