Fri Dec 05 2025 14:37:42 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మెట్ల మార్గాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మెట్ల మార్గాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి అంటే ఈ నెల 17, 18వ తేదీల్లో శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులెవ్వరూ ఈ రెండు రోజులు శ్రీవారి మెట్ల ద్వారా భక్తులు ఎవరూ రావద్దని కూడా పేర్కొంది.
అందుకే....?
ఈ నెల 17, 18వ తేదీల్లో తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడే అవకాశముంది. అలాగే జంతువులు కూడా వర్షం తాకిడికి బయటకు వచ్చే అవకాశముంది. అందుకే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి మెట్లను మూసి వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
Next Story

