Wed Jan 21 2026 06:20:04 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలో కాస్త తగ్గిన రద్దీ
తిరుమలలో రద్దీ కాస్త తగ్గింది. గత 24 గంటల్లో తిరుమల శ్రీవారిని 69,143 మంది దర్శించుకున్నారు.

తిరుమలలో రద్దీ కాస్త తగ్గింది. గత 24 గంటల్లో తిరుమల శ్రీవారిని 69,143 మంది దర్శించుకున్నారు. స్వామివారికి 26,145 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీ కానుకలు 4.38 కోట్ల రూపాయలు వచ్చాయని అధికారులు తెలిపారు. భక్తులు కంపార్ట్మెంట్లలో అయితే లేరని.. డైరెక్ట్ లైన్ ద్వారా లోనికి పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతూ ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతున్నదనని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. ఆసుపత్రి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు.
Next Story

