Thu Jan 29 2026 06:06:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు శ్రీవారిని దర్శించుకోవాలంటే 24 గంటలు వెయిట్ చేయాల్సిందే
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వరసగా నాలుగు రోజుల నుంచి తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది. అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గృహాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజులో ఇంత మంది ఇటీవల కాలంలో దర్శించుకోలేదు. ఇందులో 50,599 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుంది.
Next Story

