Sat Jan 31 2026 03:46:51 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : క్యూ లైన్లన్నీ నిండిపోయాయి.. బయటకు వరకూ నిలుచున్న భక్తులకు దర్శనం?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరకుంటున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే కనపడుతుంది. శుక్ర, శని, ఆది వారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. క్యూ లైన్ లన్నీ నిండిపోయాయి. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ శిలా తోరణం వరకూ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,927 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

