Sat Jan 31 2026 05:49:31 GMT+0000 (Coordinated Universal Time)
రష్ తగ్గలేదు.. కారణం ఇదే
తిరుమల నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. మంగళవారం సయితం భక్తుల సంఖ్య తగ్గలేదు

తిరుమల నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. మంగళవారం సయితం భక్తుల సంఖ్య తగ్గలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనానికి పది హేను గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి మరో రెండు మూడు గంటల సమయం అదనంగా పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,560 మంది దర్శించుకున్నారు. 29,751 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయలు అని చెప్పారు.
Next Story

