Tue Jan 20 2026 13:49:53 GMT+0000 (Coordinated Universal Time)
Tiger : ఒకటి కాదు... రెండు పులులట.. భయపడుతున్న జనం
ఏలూరు జిల్లాలో పులి సంచారం కలవరం పుట్టిస్తుంది. ఒక పులి కాదు రెండు పులులు తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు

ఏలూరు జిల్లాలో పులి సంచారం కలవరం పుట్టిస్తుంది. ఒక పులి కాదు రెండు పులులు తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం పంట పొలాల్లో ఒక దూడ మీదకు పులి దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సరిహద్దు ప్రాంతంలో...
దూడను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపినట్లు ఆనవాళళ్లు లభించడంతో ప్రజలు భయపడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లోనే ఈ పులి సంచారం ఉందని అటవీ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. రెండు పులులు తిరుగుతున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన చేయకున్నా పులి సంచారంతో ఆ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. పులి కోసం ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేశారు.
Next Story

