Sat Jul 27 2024 01:23:57 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : హాట్కేకుల్లా అమ్ముడయిన టిక్కెట్లు... 21 నిమిషాల్లోనే క్లోజ్
వైకుంఠం ద్వార దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ లో పెట్టిన 21 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి
![tirumala, tickets, vaikuntha dwara darsan, online, 21 minitues tirumala, tickets, vaikuntha dwara darsan, online, 21 minitues](https://www.telugupost.com/h-upload/2023/11/10/1559207-tirumala.webp)
వైకుంఠం ద్వార దర్శనం టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్ లో పెట్టిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ఈ టెక్కెట్లతో తిరుమల తిరుపతి దేవస్థానానికి 6.756 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ లో పెట్టిన పథ్నాలుగు నిమిషాల్లోనే 80 శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
6.75 కోట్ల ఆదాయం...
వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి మూడు వందల రూపాయల టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది. తొలి రోజు 22, 500 టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. అయితే అందుబాటులో ఉంచిన 21 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని టీటీడీ చెప్పింది.
Next Story