Sat Dec 06 2025 07:49:00 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజూ నేరుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో అంతగా లేదని అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండకుండా నేరుగా వెళుతున్నారు. నడకదారిన వచ్చిన భక్తులు సర్వదర్శనం క్యూలైన్లో ఉన్న వారికి నాలుగు గంటల సమయం శ్రీవారి దర్శనం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూలైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 65,237 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 22,926 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

