Sat Jan 31 2026 00:08:35 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గని రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గ లేదు. శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. శుక్రవారం కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుమలలో వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి వీరికి 20 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు క్యూలైన్ లోకి ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,062 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,761 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

