Fri Jan 30 2026 22:44:34 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. మంగళవారం కూడా భక్తులు క్యూ లైన్ లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. మంగళవారం కూడా భక్తులు క్యూ లైన్ లలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనం జరగాలంటే 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. కొత్తగా క్యూ లైన్ లోకి ప్రవేశించే వారికి మరో నాలుగు గంటల అదనంగా దర్శనానికి సమయం పడుతుంది.
ప్రత్యేక దర్శనం....
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్ పొందిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల పాటు దర్శనం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,163 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,489 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.22 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

