Wed May 15 2024 13:31:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నర్సీపట్నం బంద్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేయడంతో నర్సీపట్నంలో ఉద్రిక్తత తలెత్తింది
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేయడంతో నర్సీపట్నంలో ఉద్రిక్తత తలెత్తింది. నర్సీపట్నం బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ న్యాయస్థానం వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున ఆందోళనకు దిగాయి.
ఎమ్మెల్యే వెలగపూడి...
సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాద్వం చోటు చేసుకుంది. నర్సీపట్నంలో బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story