Thu Jan 29 2026 10:43:53 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి రూరల్ లో టీడీపీ లీడ్
ఏపీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వస్తున్నాయి. రాజమండ్రి రూరల్ లో

ఏపీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వస్తున్నాయి. రాజమండ్రి రూరల్ లోతెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల లీడింగ్ లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి లీడింగ్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 25 లోక్సభ స్థానాల నుంచి 454 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు.
Next Story

