Fri Dec 05 2025 19:14:20 GMT+0000 (Coordinated Universal Time)
33వ రోజుకు చేరిన లోకేష్ యువగళం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 33వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 33వ రోజుకు చేరుకుంది. ఉదయం పదిగంటలకు పులిచర్ల మండలం కొమ్మిరెడ్డిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం పదకొండు గంటలకు కొత్తపేటలో బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గం ప్రజలతో లోకేష్ మాటా మాంతీ జరపనున్నారు.
సమావేశాలు జరుపుతూ...
అలాగే ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు మంగంపేట మెయిన్ సెంటర్ లో స్థానికులతో సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బలిజపల్లిలో భోజన విరామానికి ఆగుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బలిజపల్లి నుంచి పాదయాత్రను కొనసాగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు మెప్పిరెడ్డిగారిపల్లిలో స్థానికులతో లోకేష్ సమావేశమవుతారు. సాయంత్రం 6.35 గంటలకు పులిచర్లలో ఎస్సీ వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం 7.40 గంటలకు కొక్కువారిపల్లి విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.
Next Story

