Fri Dec 05 2025 20:24:11 GMT+0000 (Coordinated Universal Time)
43వ రోజు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర నేడు 43వ రోజుకు చేరుకుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర నేడు 43వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు లోకేష్ 539.6 కి.మీ.దూరం నడిచారు. ఉదయం తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం ఎనిమిది గంటలకు గుట్టపాలెం విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ కొద్దిసేపటి క్రితం గట్టు గ్రామంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు.
టమాటా రైతులతో...
ఉదయం 10.30గంటలకు కొండకిందపల్లిలో స్థానికులతో మాటామంతీ జరపనున్నారు. తర్వాత11.15 గంటలకు బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద ముస్లిం సామాజిక వర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు. 12.15 గంటలకు బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద భోజన విరామానికి ఆగుతారు. 1.15 గంటలకు భోజన విరామ స్థలంలో టమోటా రైతులతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 3.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. బి.కొత్తకోటలో స్థానికులతో మాట్లాడిన తర్వాత 4.05 బి.కొత్తకోట వాసులతో సమావేశమవుతారు. రాత్రికి బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
Next Story

