Mon Mar 16 2026 04:33:54 GMT+0530 (India Standard Time)
Lokesh : టీటీడీ పై టీడీపీ నేత లోకేష్ ఫైర్
టీటీడీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు

టీటీడీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 31 కేసుల్లో నిందితుడైన జన్ క్రిమినల్ కేసులున్న 16 మందిని బోర్డు సభ్యుడిగా నియమించారని లోకేష్ ఫైర్ అయ్యారు. అందుకే భక్తులకు దూరంగా తిరుమలను నెట్టే ప్రయత్నం జరుగుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
దోపిడీ మండలిగా....
టీటీడీ ధార్మిక మండలిని జగన్ దోపిడీ మండలిగా మార్చారని లోకేష్ ఫైరయ్యారు. శ్రీవారి సేవా టిక్కెట్లను పెంచే ఆలోచన దుర్మార్గంగా ఉంటుందని చెప్పారు. ప్రసాదం, వసతి, సేవాల టిక్కెట్ల రేట్లను కూడా భారీ సంఖ్యలో పెంచేందుకు టీటీడీ సిద్ధమయిందని లోకేష్ తెలిపారు. అటువంటి ఆలోచన ఉంటే టీటీడీ తన ఆలోచనను విరమిచుకోవాలని లోకేష్ కోరారు.
- Tags
- nara lokesh
- ttd
Next Story

