Wed Jan 28 2026 23:51:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మలి విడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించారు.
పామర్రు, ఉయ్యూరులో...
ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరిట సభలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలోని పామర్రు, ఉయ్యూరులలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తన సభల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ కూటమికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
Next Story

