Sun Dec 14 2025 01:59:16 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్ కు చంద్రబాబు లేఖ... కోటి ఇవ్వాలంటూ?
ఆంధ్రప్రదేశ్ చీఫ సెక్రటరీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ చీఫ సెక్రటరీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలను సాయంగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీంతో పాటు సాయితేజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ కు రాసిన లేఖలో కోరారు.
లేఖ ద్వారా....
సాయితేజ ఆర్మీ హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇద్దరు చిన్న పిల్లలు. పేదకుటుంబం కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి లేఖ ద్వారా తెలియజేశారు.
Next Story

