Sat Apr 27 2024 05:02:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ఎదురుగాలి : టీడీపీ ముందంజ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీడీీపీ అభ్యర్థి చిరంజీవి ఇతర పార్టీల అభ్యర్థి కంటే ముందంజలో ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనిడానికి ఇది నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో గెలిచిన వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రం వెనుకంజలో ఉండటం విశేషం.
ప్రభుత్వ వ్యతిరేకత....
ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యంగా యువత, ఉపాధ్యాయులు. ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఈ ఎన్నిక ద్వారా స్పష్టమవుతుందని తెలిపారు. ఎన్నికల ద్వారానైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టిడిపికి వచ్చిందంటే టిడిపి పట్ల సానుకూలత అనేది కూడా కనిపిస్తుందన్నారు.
Next Story