Fri Dec 05 2025 22:17:33 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కేసులో రఘరామ పిల్ పై హైకోర్టు ఆదేశం
జగన్ కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ కు నెంబరు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై వేసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ కు నెంబరు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ కేసులను సీబీఐ, ఈడీ సక్రమంగా దర్యాప్తు చేయలేదని, దీనిపై విచారణ చేయాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు.
విచారణ అర్హత....
అయితే రఘురామ కృష్ణరాజు పిటీషన్ ను విచారణకు స్వీకరించడానికి హైకోర్టు కార్యాలయం అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే దీనిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అన్నది ధర్మాసనం తేలాల్సి ఉందని, వెంటనే ఆ పిటీషన్ కు నెంబరు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

