TDP : టీడీపీ తీసుకున్న ఆ నిర్ణయంతో ఇక వారి ఆశలు గల్లంతయినట్లే
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ల శకం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నవతరం ఉరకలెత్తుతోంది. మొన్నటి ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ పార్టీ పూర్తిగా యువనేత లోకేశ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతెందుకు ప్రభుత్వం ఏర్పడిన మంత్రి వర్గం కూర్పు నుంచి నిన్నటి జిల్లా అధ్యక్షుల నియామకం వరకూ చూస్తే లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తన యువగళం పాదయాత్రలో కనెక్ట్ అయిన యువలీడర్లకు లోకేశ్ పెద్ద పదవులు కట్టబెట్టడంలో వెనకాడటం లేదు. అదే రెండేళ్లుగా జరుగుతుంది. దీంతో సీనియర్లకు ఇక టీడీపీలో కనెక్షన్ కట్ అయినట్లే కనిపిస్తుంది. సీనియర్లు జీపీఎస్ లాంటి వారని యువలీడర్లు మిస్సైల్స్ వంటి వారని లోకేశ్ చెబుతున్నా వాస్తవానికి సీనియర్ నేతలు ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కనిపించకపోవచ్చు.

