Thu Apr 25 2024 09:42:45 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు టీడీపీ ధర్నా
ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముందు టీడీపీ ధర్నాకు దిగింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముందు టీడీపీ ధర్నాకు దిగింది. టీడీపీ కార్పొరేటర్ చంటి ఆందోళనకు దిగారు. తనకు తెలియకుండా తన వార్డులో పింఛను పంపిణీని మంత్రి చేపట్టారని కార్పొరేటర్ చంటి ఆరోపిస్తున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 52వ డివిజన్ లో పర్యటించారు.
ప్రొటోకాల్ ను పాటించలేదని......
అయితే తన పర్యటన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ను ఆహ్వానించలేదు. ప్రొటోకాల్ పాటించలేదని టీడీపీ ఆరోపిస్తుంది. ప్రొటోకాల్ ను పాటించమని అడిగితే తనను దూషించారని కార్పొరేటర్ చంటి చెబుతున్నారు. అందుకే తాను నిరసనకు దిగానని చెప్పారు. దీనిపై తాను కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తనకు న్యాయం చేయాలని చంటి కోరుతున్నారు.
Next Story