Fri Dec 05 2025 16:37:15 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అరాచకాలను ఇక సహించం
వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఆయన ఖండించారు. గత రెండున్నరేళ్లుగా ఏపీలో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ చేతిలో హత్యకు గురయ్యారన్నారు. నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులను చేసేందుకు ఈ హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇద్దరూ హత్యారాజకీయాలను....
ఏపీలో జగన్ రెడ్డి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వైసీపీ అరాచకాలను సహించేది లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
- Tags
- achennaidu
- tdp
Next Story

