Fri May 17 2024 04:15:53 GMT+0000 (Coordinated Universal Time)
TDP : గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభ
ఈ నెల 5 నుంచి 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు
ఈ నెల 5వ తేదీ నుంచి 29 వరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘‘రా.. కదిలిరా..’’ పేరిట రోజుకు రెండు సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. సభలకు లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలనపై విసిగిపోయి ప్రజలు ప్రభంజనంలా రావడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ఠ్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనెల 5న మొదటి సభ ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో నిర్వహిస్తామని తెలిపారు. 6న తిరువూరు, ఆచంటలో, ఈనెల 9న వెంకటగిరి, ఆళ్లగడ్డలో సభలు నిర్వహించనున్నట్లు అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు.
పవన్, చంద్రబాబు కలసి...
వచ్చే నెల10వ తేదీన బొబ్బిలి, తునిలో, ఈనెల 18న గుడివాడలో సభలు ఉంటాయని చెప్పారు. 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ ఇచ్చిన ‘రా కదలి రా’ పిలుపునే ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్న అచ్చెన్నా విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో ఏమీ లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో తోనే స్వర్ణయుగం సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. సభలన్నీ తెలుగుదేశం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. చంద్రబాబు, పవన్ లు కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
Next Story