Thu Dec 18 2025 18:10:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పెనుగొండలోకి చినబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పెనుగొండ నియోజవర్గంలోకి ప్రవేశించనుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పెనుగొండ నియోజవర్గంలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ 636 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. ఈరోజు 51వ రోజుకు యాత్ర చేరుకుంది. ఈరోజు ఉదయం రామయ్యపేట విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై రామయ్యపేటలోని మహిళ ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం 10.40 అల్లపల్లిలో ఆటోడ్రైవర్లతో లోకేష్ సమావేశమయి వారి సమస్యలపై చర్చిస్తారు. అనంతరం 11.20 గంటలకు గౌనిపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు.
యువతతో...
మధ్యాహ్నం 12.15 గంటలకు పగడాలవారిపల్లిలో బీసీ సామాజికవర్గ ప్రజలు సమావేశమై వారి సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పగడాలవారిపల్లిలో భోజన విరామానికి ఆగుతారు. అక్కడే యువతతో సమావేశమై ఉపాధి అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం నాలుగు గంటలకు పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గౌనివారిపల్లిలో స్థానికులతో సమావేశమవుతారు. 5.35 గంటలకు కొరెవండ్లపల్లిలోనూ స్థానికులతో సమావేశమైన అనంతరం కొండాపురం పంచాయతీ రెడ్డి చెరువు కట్ట వద్ద రాత్రికి బస చేస్తారు.
Next Story

