Thu Dec 18 2025 23:03:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కావలికి లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కావలిలో పర్యటించనున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కావలిలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుగ్గిరాల కరుణాకర్ కుటుంబ సభ్యలును లోకేష్ పరామర్శించనున్నారు. ఆయన కావలి నియోజకవర్గంలో ముసునూరులో వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శిస్తారు.
లోకేష్ పర్యటన కోసం...
లోకేష్ పర్యటన కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. లోకేష్ పర్యటనకు సంబంధించి పోలీసుల అనుమతి తీసుకున్నారు. త్వరలోనే ఉదయగిరి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మరోసారి నెల్లూరు జిల్లాకు లోకేష్ వస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
Next Story

