Thu Apr 25 2024 07:39:54 GMT+0000 (Coordinated Universal Time)
మరో అభ్యర్థిని ప్రకటించిన లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆయన పీలేరు నియోజకవర్గం అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ పీలేరు జరిగిన ప్రతి సభలో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరెక్కడా ఆయన అభ్యర్థుల పేర్లను ప్రస్తావించలేదు. తిరిగి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో అభ్యర్థిని నారా లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకటప్రసాద్ ను గెలిపించాలని కోరారు.
పొత్తులు కుదరకముందే...
పొత్తులు కుదురుతాయని భావిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ ప్రకటన చర్చనీయాంశమైంది. కదిరి నియోజవర్గంలో జనసేన పోటీ చేయాలని భావిస్తుండటం ఇందుకు కారణం. పొత్తులు కుదరక ముందే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారంటూ జనసేన కదిరి నియోజకవర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు నారా లోకేశ్ ను టీడీపీ తరుపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, చిరంజీవిరావులు కదిరిలో కలిశారు. లోకేశ్ బస చేసిన ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్సీలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ఆప్యాయంగా హత్తుకుని నారా లోకేశ్ అభినందించారు.
Next Story