Sun Dec 14 2025 01:54:21 GMT+0000 (Coordinated Universal Time)
టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. వాటిపై ఎక్సైజ్ కమిషనర్ కు..

విజయవాడ : విజయవాడలో బుధవారం మధ్యాహ్నం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయగా.. కొద్దిసేపు టిడిపి శ్రేణులకు - పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. వాటిపై ఎక్సైజ్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు టిడిపి ఎమ్మెల్యేలు ఆబ్కారీ శాఖ కార్యాలయానికి బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై టిడిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వినతి పత్రం సమర్పణకు కూడా తమను అనుమతించరా? అంటూ మండిపడ్డారు.
Next Story

