TDP : గంటాకు టీడీపీ హైకమాండ్ వార్నింగ్.. ఇది లాస్ట్ ఛాన్స్ అంటూ?
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ పరువు తీసేలా ఉందని టీడీపీ అధినాయకత్వం అభిప్రాయపడింది. నిన్న గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. "ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి" అంటూ ట్వీట్ చేశారు.

